ఈ సందర్భంగా వారు దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు నివాళులర్పించారు. భారత సినిమాకు ఏఎన్నార్ చేసిన అపురూప కృషిని గుర్తిస్తూ, "అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వం" అనే నివాళిని పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అందజేశారు.
ఏఎన్నార్ జీవిత కృషికి మీరు చేసిన గుర్తింపు మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన ధృవీకరణలాంటిదని కామెంట్లు చేసింది. ఇంకా #ANRLegacy #IndianCinema #ANRLivesOn అంటూ శోభిత వెల్లడించింది.