సికింద్రాబాద్ నగరంలో దారుణం జరిగింది. గత రాత్రి దారిదోపిడి జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసిన దుండగుడు అతడి కాళ్ళలో కారు కొట్టి, కత్తితో పొడిచి అతని వద్ద ఉన్న 14 తులాల బంగారం నగలను దోచుకుని వెళ్లారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హిమాయత్ నగర్లోని రాధే జువెల్లర్స్కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్కు బయలుదేరాడు. సికింద్రాబాద్ నగర్కు చేరుకున్నాక సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతడిపై దాడి చేసి కాళ్ళలో కారం చల్లి, కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అతనివద్ద ఉన్న 14 తులాల బంగారం నగలను దోచుకుని పారిపోయాడు.