వరల్డ్ ఉమెన్స్ డే : నెల్లూరులో బ్రిటన్ మహిళపై అత్యాచారం

మంగళవారం, 8 మార్చి 2022 (18:01 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నెల్లూరు జిల్లాకు సమీపంలోని సైదాపురం సమీపంలోని రూపూరు రోడ్డులో బ్రిటన్ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెనువెంటనే కేసు రంగంలోకి దిగి నిందితుల ఆచూకీ కోసం విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో విదేశీ మహిళపై అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం చెలరేగింది. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు