భార్యలో మార్పు వస్తుందని పుట్టింటికి పంపిస్తే...

మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (21:16 IST)
భార్య వివాహేతర సంబంధం తెలిసింది. దీంతో బిడ్డతో పాటు ఆమెను పుట్టింటికి పంపాడు. కొన్నిరోజులు గడిస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించాడు. అలా కాలేదు కదా ఏకంగా ప్రియుడినే పుట్టింటికి పిలిపించుకుంది. చివరకి...

 
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన వెంకటరమణ, రామభద్రాపురం మండలం కొండపాలవలసకు చెందిన లలితకుమారికి 2015లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భర్త, పిల్లాడితో హాయిగా సాగిపోతున్న కుటుంబంలో బాలు అనే యువకుడు ప్రవేశించాడు.

 
దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆరు నెలల పాటు అతడితో సన్నిహత సంబంధం కొనసాగించింది. ఎక్కువరోజులు అది సాధ్యం కాదు కదా..అడ్డంగా దొరికిపోయింది. అయితే భర్త హెచ్చరించాడు. తప్పని చెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో పుట్టింటికి పంపాడు. అయితే అక్కడ కూడా ప్రియుడిని పిలిపించుకుంది. విషయం తెలుసుకున్న భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

 
ప్రాణంగా భావించే భార్యే ఈ విధంగా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను లేఖ కూడా రాశాడు. ప్రస్తుతం ఆ లేఖ పోలీసుల అదుపులో ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు