దాసారాం బస్తీలో దారుణం... మద్యంమత్తులో రౌడీ షీటర్ హత్య

మంగళవారం, 24 అక్టోబరు 2023 (13:53 IST)
హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మద్యం మత్తులో షరీఫ్ అనే రౌడీ షీటర్‌ తరుణ్‌పై బండ్లరాళ్లపై షేక్ షరీఫ్ అనే రౌడీ షీటర్ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. 
 
దీంతో వారు అక్కడకు వచ్చి దాడిలో గాయపడిన రౌడీ షీటర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. తరుణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, ఎస్ఆర్ నగర్ ఏసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 
 
తిరువణ్ణామలై జిల్లాలో దారుణం : లారీ - సుమో ఢీ.. ఏడుగురి మృత్యువాత
 
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సెంగం పక్రియపాళెం సెంగం బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ, సుమోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లారీని సుమో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు... సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నేపాల్‌ను భయపెడుతున్న వరుస భూకంపాలు 
 
నేపాల్ దేశాన్ని వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. రెండు రోజు క్రితం ఆ దేశ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందురూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ తెల్లవారుజామున 4.17 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే గడుపుతున్నారు. ఖాఠ్మాండుకు ఉత్తర, ఈశాన్యం దిశగా 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 
 
తాజా భూకంపంలోనూ ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు ఇప్పటివరకు అందలేదు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్ భూకంపాలు సర్వసాధరణంగా మారాయి. శతాబ్దానికి ఒకసారి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండుమీటర్ల మేర దగ్గరకు జరుగుతుండడంతో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను ప్రళయాన్నే సృష్టించింది. ఈ భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మిలియన్ నిర్మాణాలు కుప్పకూలాయి. అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ప్రపంచంలో నేపాల్ 11వ స్థానం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు