జిమ్ కెళ్లి స్లిమ్ అవమంటే ట్రైనర్‌తో కమిట్ అయిన భార్య, భర్త ఏం చేసాడంటే?

గురువారం, 23 సెప్టెంబరు 2021 (21:04 IST)
భార్య లావు అవుతోంది. ఆమె ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు భర్త. ఆమెను ఎలాగైనా స్లిమ్‌గా చేయాలని భావించాడు. అందుకే దగ్గరలోని జిమ్‌లో భార్యను చేర్పించాడు. ట్రైనింగ్ తీసుకుంటూ భార్య ట్రైనర్‌తో కమిట్ అయ్యింది. విషయం తెలిసిన భర్త కిరాయి రౌడీలను పిలిపించి వాయించాడు.
 
పాట్నా పరిసర ప్రాంతంలో నివాసముండే కుష్భూసింగ్ సరిగ్గా మూడు నెలల క్రితం జిమ్‌లో చేరింది. కరోనా సమయంలో ఇంటిలో ఖాళీగా కూర్చుని బాగా తినడంతో ఆమె లావుగా మారింది. ఖుష్భూ లావుగా మారడం ఏమాత్రం ఇష్టం లేదు భర్తకి. ఎప్పుడూ స్లిమ్‌గా అందంగా ఉండే భార్య అలా లావు అవడంతో భర్త ఆవేదనకు గురయ్యాడు.
 
భార్యను స్లిమ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇంటికి దగ్గరలోని జిమ్‌లో చేర్పించాడు. జిమ్‌లో చేరిన ఖుష్బూకు జిమ్ మాస్టర్ వ్యాయామంతో పాటుగా ప్రేమ పాఠాలు నేర్పించాడు. భర్త ఉద్యోగానికి వెళ్ళిందే ఆమె జిమ్ మాస్టర్ విక్రమ్‌ను పిలిచి ఎంజాయ్ చేసేది. 
 
అయితే వారంరోజుల క్రితమే భర్తకు విషయం తెలిసింది. భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ప్రియుడితో కలిసి తన భార్య బెడ్ రూంలో ఉండగా కిరాయి రౌడీలను తీసుకొచ్చాడు భర్త. ఇద్దరినీ చితకబాదాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళేంత వరకు తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించాడు. ఇది కాస్త ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు