దీపావళి ప్రమిదను వెలిగించిన ఒబామా

PTI
అమెరికా అధ్యక్షుడు ఒబామా తొలిసారిగా దీపావళి వేడుకలను శ్వేత సౌధంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించి భారతదేశ సంప్రదాయలకున్న ప్రాముఖ్యతను చాటారు. ప్రవాస భారతీయులను ఆహ్వానించి భారతీయ సంప్రదాయ పద్ధతుల నడుమ దీపావళి ప్రమిదను వెలిగించారు.

దీపావళి సందర్భంగా మన ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి బహుమతులను ఇస్తుందో తెలియదు కానీ... అమెరికా అధ్యక్షుడు మాత్రం అమెరికాలో నివశిస్తున్న భారతీయులందరికీ హెల్త్ పాలసీని ప్రకటించి, భారతీయుల పట్ల తమకున్న ప్రత్యేక శ్రద్ధ ఏమిటో నిరూపించారు.

ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ... యావద్భారత పౌరుని జీవితంలోకి ఈ పండుగ కొత్త వెలుగులు నింపి సుఖసంతోషాలను అందిచాలని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి