యాస్మిన్ వోరాకు వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్కు ప్రయాణం కావాల్సివుంది. అయితే థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన ప్రయాణ టిక్కెట్ను 12వ తేదీకి మార్చుకుని, చివరకు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని తలచకుని యాస్మిన్ భర్త బోరున విలపిస్తున్నాడు.
పైగా, ప్రమాదం జరిగిన రోజున యాస్మిన్ను ఆమె భర్త యాసిన్ స్వయంగా విమానాశ్రయంలో వదిలిపెట్టారు. విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పని చేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. అలాంటిదేమీ ఉండదు. కాసేపటికి ఏసీ ఆన్ అవుతుంది. అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను అని ఆయన తన భార్యతో జరిగిన చివరి సంభాషణ తలచకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.