చింతల్కుంటలోని ప్రధాన రహదారి పక్కనున్న ఫుట్పాత్పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తుంగా, ఆదివారం వేకువజామున సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు భారీ శబ్దంతో వారిపై తెగిపడి, క్షణాల్లో మంటలు అంటుకున్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు మంటల్లోనే కాలిపోయారు.
సమాచారం. అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు వారు యాచకులై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.