చెన్నై బ్యూటీ సమంతకు టాలీవుడ్లో విపరీతంగా క్రేజ్ వుంది. అయితే ఈ క్రేజ్ను కొందరు సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెను వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత వైఎస్ జగన్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటుందని విశ్వసనీయ సమాచారం. అసలు ఆంధ్రా రాజకీయాల్లో సంబంధంలేని సమంత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ఎందుకు ప్రచారం చేస్తుందనే సందేహం రాక మానదు. అయితే అందుకు ఓ కారణం కూడా వుంది. సమంతకు కాస్ట్యూమ్ డీజైనర్ అయిన కోన నీరజ (కోన వెంకట్కి కజిన్) తండ్రి కోన రఘుపతి బాపట్ల నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.
అయితే ఆయన తరపున ప్రచారం చేయమని నీరజ కోరగా అందుకు సమంత ఒప్పుకున్నట్లు సమాచారం. అయినా ఇది ఊరికే కూడా కాదట, ఇందుకు గాను సమంతకు కోటి రూపాయలు సమర్పించుకుంటున్నారట. మరి, ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.