క్షీరాబ్ది ద్వాదశి నాడు చేయవలసిన అత్యంత ముఖ్యమైన ఆచారం దామోదరుడు లేదా సాలగ్రామం, తులసి దేవి వివాహాన్ని నిర్వహించడం. దీనినే బృందావన ద్వాదశి అని కూడా అంటారు. ఆరోజు సాయంకాలం లేదా శుభ ముహూర్తంలో తులసి మొక్కను శుభ్రం చేసి, ముగ్గులతో అలంకరించాలి. తులసిని పెండ్లికూతురుగా భావించి చీర, నగలతో అలంకరిస్తారు. తులసి పక్కన శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని లేదా పటాన్ని లేదా ఒక ఉసిరిక కొమ్మను ఉంచి, బ్రహ్మ ముడితో.. అంటే పసుపు దారంతో వారికి కళ్యాణం జరిపిస్తారు.