మామిడి పండ్లు వచ్చేశాయ్, కరోనా వైరస్ వుందనీ...

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (23:22 IST)
మార్కెట్లోకి ఇప్పుడిపుడే మామిడిపళ్లు వచ్చేస్తున్నాయి. ఐతే కరోనా వైరస్ భయంతో వ్యాపారులు మామిడి పళ్లను కొనుగోలు చేసేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరుకు ఈ సీజన్లో కనీసం 12 రకాల మామిడి పళ్లు లభ్యమయ్యేవనీ, ఇప్పుడు కేవలం 5 రకాలు మాత్రమే కనబడుతున్నాయనీ, అది కూడా 30 శాతం మేర మార్కెట్లో తక్కువగా వస్తున్నాయని వ్యాపారులు చెపుతున్నారు. 
 
ఇదంతా కరోనా వైరస్ భయంతో చాలామంది రావడంలేదని అంటున్నారు. ఐతే మామిడి పండ్లను కొనుగోలు చేసిన తర్వాత తగిన విధంగా శుభ్రం చేసి తినవచ్చు. ఐతే మామిడి కాయలపై తొక్కు లేచిపోకుండా వున్నవి చూసుకుని ఎంపిక చేసుకుంటే మంచిది. ఇక ఈ మామిడి కాయలు తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి మరియు ఫైబర్ శరీరంలో హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
 
2. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉంటుంది.
 
3. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.
 
4. దానిలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది.
 
5. ఈ పండులో వుండే విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వృద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది.శృంగారంలో ఆసక్తి లేనివారికి శృంగార వాంఛను కలిగిస్తుంది.
 
6. మామిడిపండులో శరారంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంది, ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు