ఈ ప్రభావం కారణంగా నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.