గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గురువారం, 4 ఆగస్టు 2022 (21:51 IST)
ఉదయాన్నే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. బరువు తగ్గడం నుండి చర్మ ఆరోగ్యం వరకు, వేడి నీరు అనేక ఆరోగ్య సమస్యలకు మేలు చేస్తుంది. అయితే వేడినీళ్లు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. చాలామందికి దీని గురించి అవగాహన లేదనీ, ఈ వేడినీరు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు.

 
ఎక్కువ వేడి నీరు తాగటం వల్ల నోటిపూత, నోటిలో చిన్న కాలిన గాయాలకు కారణమైతే, అది ఖచ్చితంగా శరీరంలోని అంతర్గత అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుంది. అత్యంత సాధారణంగా ప్రభావితమైన అవయవాలు అన్నవాహిక మరియు జీర్ణవ్యవస్థ, ఇవి సున్నితమైన లోపలి పొరను కలిగి ఉంటాయి. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండటం వలన అవి ప్రభావితమవుతాయి. కనుక మితిమీరిన వేడినీటిని తాగరాదు.

 
ఇంకా మూత్రపిండాలు అదనపు నీటిని, అన్ని రకాల మలినాలను తొలగించడానికి బలమైన కేశనాళిక వ్యవస్థను కలిగి ఉంటాయి. వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫ్లషింగ్ ప్రక్రియ మెరుగుపడుతుందని లేదా వేగవంతం అవుతుందని అనుకుంటారు కానీ అలా జరగదు. విరుద్ధంగా, అధికంగా వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలకు అదనపు పని పెరుగుతుంది. దీంతో హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడుతుందని చెబుతారు. ఒకేసారి ఎక్కువ నీరు మెదడు కణాల వాపుకు కారణమవుతుంది. కనుక ఇది మానవ శరీరానికి ప్రమాదకరం.
 
వేడి నీటిని ఎక్కువగా తాగడం కూడా రక్త పరిమాణానికి ప్రమాదకరం. అవసరమైన దానికంటే ఎక్కువ వేడి నీటిని తీసుకోవడం వల్ల మొత్తం రక్త పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ అనేది ఒక క్లోజ్డ్ సిస్టమ్. అది అనవసరమైన ఒత్తిడిని పొందినట్లయితే, అది అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు