ఊరగాయ పచ్చళ్లను మోతాదుకి మించి తింటే ఏమవుతుంది?

గురువారం, 7 జులై 2022 (22:17 IST)
ఊరగాయ పచ్చళ్లను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఐతే మోతాదుకి మించి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పచ్చళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే హానికరమైన సమస్యలు ఏమిటో చూద్దాం.

 
ఊరగాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దానిలో ఉపయోగించే మసాలాల కారణంగా కొలెస్ట్రాల్, ఇతర సమస్యలు వస్తాయి. ఊరగాయలను తయారు చేయడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు శరీరానికి హానికరం. శరీరంలో అసిడిటీ, మంటకు కారణమవుతాయి.

 
ఊరగాయలలో ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక సోడియంతో పాటు అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మసాలా దినుసులు కాకుండా, వెనిగర్ కూడా ఎక్కువ పరిమాణంలో ఊరగాయలలో ఉపయోగించబడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే అల్సర్, ఇతర సమస్యలను కూడా కలిగిస్తుంది.

 
ఊరగాయను ఉపయోగించడం వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది, దీని కారణంగా వల్ల ఎసిడిటీ, గ్యాస్, పుల్లని త్రేనుపు వంటి ఇతర సమస్యలు తలెత్తవచ్చు. కనుక ఊరగాయ పచ్చళ్లను మోతాదుకి మించి తినరాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు