ఎండుద్రాక్షాలతో అలసట, ఒత్తిడికి చెక్ పెట్టవచ్చును...

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (12:45 IST)
ఎండుద్రాక్షలలో విటమిన్స్, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ద్రాక్షల్లోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. జీర్ణాశయం లోపలి భాగానికి రక్షణను ఇస్తుంది. కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతుంది. ఈ ద్రాక్షలను తరచుగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఈ ద్రాక్షల్లోని ఐరన్ రక్తసరఫరాను మెరుగుపరచుటకు దోహదపడుతుంది. వ్యాధిగ్రస్తులకు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వలన అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి రోజంతా తాజాగా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు