*కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యే వరకూ మరగించి, వడకట్టి చల్లార్చి పరగడుపునే త్రాగాలి.
* రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు ఆవు పాలలో ఒక చిన్న చెంచా పసుపు కలిపి వేడి చేసి, దించి దానిలో ఒక చెంచా ఆవు నెయ్యి వేసి, బాగా తిరగగొట్టి త్రాగాలి.
* ఈ వైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు.
* సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి.