ఆకుపచ్చ కంటే పసుపు అరటి పండే బెస్ట్.. బరువు తగ్గాలంటే ఒక పండే చాలు!

సోమవారం, 27 జూన్ 2016 (11:51 IST)
అరటిపండ్లలో ఆకుపచ్చ అరటిపండ్ల కంటే పసుపు పచ్చ రకం పండ్లలో పోషకాలు ఎనిమిదిరెట్లు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుచేత రోజుకొక ఆపిల్ తినలేని వారు.. రోజుకు రెండు  అరటిపండ్లు తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెండు అరటిపండ్లు తీసుకోవడం ద్వారా 90 నిమిషాల పాటు వ్యాయం చేయగల శక్తి మనకు లభిస్తుంది.

కానీ అరటిపండ్లలో అధిక పిండిపదార్థాలుంటాయి. అందుచేత వాటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకుండా ఉండటం మంచిది. ఇంకా బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక అరటిపండుతో సరిపెట్టుకోవడం మంచిది. 
 
అరటిలోని బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ట్రిప్టాన్‌లనే ప్రోటీన్లు కొన్ని రసాయన చర్యల త్వారా సంతోషాన్నిచ్చే సెరటోనిన్ హార్మోన్‌గా మారుతాయి. తద్వారా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. అరటిలోని ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. శరీరంలో అరటిపండు ఎంత పడితే అంత క్యాన్సర్ నిరోధక గుణాలు అధికమవుతాయి.

వెబ్దునియా పై చదవండి