పనస పండ్లను ప్రతిరోజూ తింటే...(video)

మంగళవారం, 17 జులై 2018 (09:24 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో చాలా మంది పనస పండును తినేందుకు ఆసక్తిని చూపిస్తారు.
 
సాధారణంగా ఈ పండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్ల కన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు అందిస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే అసలు పనస పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 
 
* పనస పండ్లలో విటమిన్ ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. 
* పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. 
* పనస పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వాపులను తగ్గిస్తుంది. 
* పనస పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. 
* గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
* పనస పండును తరచూ తీసుకుంటుంటే అలాంటి ముడతలు ఏర్పడవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 
* రుచి తియ్యగా ఉన్నప్పటికీ పనస పండ్లు షుగర్ లెవల్స్‌ను పెంచవు. 
* ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి. 
* డయాబెటిస్ ఉన్న వారు కూడా పనస పండ్లను నిర్భయంగా తినవచ్చు. 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు