కావలసిన పదార్థాలు : పనీర్... ముప్పావు కిలో కొత్తిమీర... వంద గ్రాములు పచ్చిమిర్చి... 25 గ్రాములు అల్లం పేస్టు... 10 గ్రాములు ఛాట్ మసాలా... 5 గ్రాములు కార్న్ఫ్లోర్... 10 గ్రాములు ఉప్పు... రుచికి సరిపడా
తయారీ విధానం : పనీర్ను దళసరిగా చతురస్త్రాకారంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమామిడి గుజ్జు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు.. అన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. పనీర్ ముక్కలకు చాకుతో గాట్లు పెట్టి అందులోకి ఈ పేస్టును కూరాలి.
పావు వంతు పేస్టును మిగిల్చి ఒక పాత్రలోకి తీసుకుని దాంట్లో అల్లం పేస్టు, ఛాట్ మసాలా, కార్న్ఫ్లోర్, కాస్త నూనె కలిపి పనీర్ ముక్కల్ని అందులో వేసి 2 గంటలపాటు ఉంచాలి. తరువాత పనీర్ టిక్కాలని బొగ్గుల పొయ్యిమీదగానీ, గ్రిల్ స్టౌమీదగానీ 8 నిమిషాలపాటు రోస్టులా కాల్చి, వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.