హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

సెల్వి

బుధవారం, 16 జులై 2025 (19:36 IST)
మంగళూరుకు వచ్చిన కేరళకు చెందిన వ్యాపారవేత్తను హనీట్రాప్ చేసిన కేసులో ఓ యువతి సహా ఎనిమిది మంది నిందితులను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో ప్రీతమ్ బొండేల్, మూడ్షెడ్డేకు చెందిన కిశోర్, మురళి, సుశాంత్, అభి, మూడ్బిద్రేకు చెందిన యువతి ఉన్నారు. 
 
ఫిబ్రవరి 16న వామంజూర్ సమీపంలోని మూదుషెడ్డే రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది.కేరళకు చెందిన మొయిద్దీన్ కున్హా,మహ్మద్ రుక్సాద్‌లకు వేరొకరితో పరిచయం ఏర్పడి మూడ్ బిద్రేకు చెందిన ఓ యువతితో కలిసి రిసార్ట్‌కు వెళ్లారు.
 
రాత్రి సమయంలో ఓ ముఠా గదిలోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి మొయిద్దీన్‌పై దాడి చేసి డబ్బుల కోసం చిత్రహింసలకు గురిచేశారు. దీనిపై కావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు