కావలసిన పదార్థాలు : బియ్యం.. రెండు కప్పులు తురిమిన క్యారట్.. ఒక కప్పు నిమ్మకాయ.. ఒకటి
పోపు కోసం... ఆవాలు.. అర టీ. జీలకర్ర.. అర టీ. మినప్పప్పు.. అర టీ. జీడిపప్పు.. పది వేరుశెనగపప్పు.. 50 గ్రా. నూనె.. ఒక టీ. పసుపు.. చిటికెడు కరివేపాకు.. రెండు రెమ్మలు ఉప్పు.. తగినంత కొత్తిమీర ఆకులు.. కాసిన్ని
తయారీ విధానం : బియ్యాన్ని కాస్త బిరుసుగా వండి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో క్యారట్ తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి.. సమంగా పట్టించి పక్కనుంచాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు, జీడిపప్పు, వేరుశెనగపప్పు వేసి.. అవి వేగిన తరువాత పసుపు, జీలకర్ర వేయాలి.
చివరగా కరివేపాకు వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా క్యారట్ కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి కలియబెట్టాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే ఎర్రగా, కమ్మగా అలరించే క్యారట్ రైస్ రెడీ...!