కావలసిన పదార్థాలు : అరటికాయ, బీన్స్ ముక్కలు.. చెరో కప్పు ఉల్లిపాయలు.. రెండు పనీర్ తురుము.. ఒక కప్పు అల్లం.. పది గ్రా. వెల్లుల్లి.. పది గ్రా. బంగాళాదుంపలు.. రెండు కొబ్బరి తురుము.. ఒక కప్పు క్యారెట్ తురుము.. ఒక కప్పు కార్న్ఫ్లోర్.. 3 టీ. మైదా.. ఒక కప్పు ఉప్పు.. తగినంత గరంమసాలా.. 2 టీ. పచ్చిమిర్చి.. నాలుగు కొత్తిమీర.. ఒక కప్పు నూనె.. తగినంత ఛీజ్.. 50 గ్రా.
తయారీ విధానం : ఉడికించిన బంగాళాదుంపల పొట్టుతీసి మెత్తగా చిదిమి ఒక పాత్రలో వేయాలి. అదే పాత్రలో బీన్స్ అరటి ముక్కలు, అల్లం వెల్లుల్లి తరుగు, గరంమసాలా.. కార్న్ఫ్లోర్, మైదా.. క్యారెట్, కొబ్బరి తురుములు.. పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు కొద్ది కొద్దిగా తీసుకుని తగినంత నీటితో ముద్దగా కలిపి ఉంచాలి. మరో బౌల్లో పనీర్, ఛీజ్ ముక్కలు.. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి.
ముందు కలిపిన ఆలూ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని అందులో పనీర్ మిశ్రమాన్ని ఉంచి పూర్ణంలా చేసి.. అరచేతిలో పెట్టి అర్ధచంద్రాకారంలో వత్తాలి. అలా మొత్తం పిండినంతా చేసుకున్నాక ఒక్కోదానిపై జీడిపప్పుతో అలంకరించాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలో వీటిని వేసి ఎర్రగా కాల్చి తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చాందినీ చిట్టీ తయార్..!