Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

సెల్వి

బుధవారం, 18 జూన్ 2025 (16:45 IST)
Jagan
ఏపీ మాజీ సీఎం, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో వున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు.  గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. 
 
జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ కాన్వాయ్‌ వెంట ఉన్న ఒక కారు లాల్‌పురం హైవే దగ్గర ఓ వృద్ధుడిని ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వృద్ధుడిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి స్థానికులు స్పందించి ఆ వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మనుషులు ప్రాణాల తీసి, ఆ శవాలను దాటుకుని ఊరేగింపులా? ఇదేమి ఉన్మాదం?

పోలీసుల సూచనలు పాటించమని మొత్తుకున్నారు.. మీ రీల్స్, ప్రచార పిచ్చతో ఉన్మాదులలాగా రోడ్ల పై పడి, ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
గుద్దేసి కనీసం మానవత్వం కూడా లేకుండా అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయి, ఊరేగుతున్నారు.… pic.twitter.com/CpyNtDHOG3

— Telugu Desam Party (@JaiTDP) June 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు