ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్
అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో విశ్వాస్ రమేష్ కుమార్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే తన సోదరుడు అంత్యక్రియల్లో పాల్గొని, సోదరుడు పాడె మోశాడు. ఈ దృశ్యం నెట్టింట ఎమోషనల్గా మారింది. ఈ విమానంలో అతడితో పాటు ప్రయాణించిన అతని సోదరుడు అజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయిన విషయంతెల్సిందే.