దాయాదుల వంటకం "కరాచి పుణుకులు"

FILE
కావలసిన పదార్థాలు :
ఉప్మారవ్వ.. పావు కేజీ
మైదాపిండి... 150 గ్రా.
మినపపిండి... ఒక కప్పు
ఉల్లిపాయలు.. నాలుగు
పచ్చిమిర్చి.. ఆరు
కొత్తిమీర... 2 కట్టలు
వంటసోడా.. చిటికెడు
ఉప్పు... తగినంత
నూనె.. సరిపడా

తయారీ విధానం :
ఓ గిన్నెలో మినప్పిండి వేసి అందులోనే రవ్వ, మైదాపిండి, వంటసోడా వేసి నీళ్లు చేర్చి జారుగా కలిపి 3 గంటలపాటు పులియనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి.

ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగాచేసి కాగుతున్న నూనెలో వేసి.. ఎర్రగా వేయించి తీయాలి. వీటిని ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి. అంతే మన దాయాదులైన పాకిస్థానీయులు ఇష్టంగా తినే కరాచీ పుణుకులు తయార్...!

వెబ్దునియా పై చదవండి