కావలసిన పదార్థాలు : ఉప్మారవ్వ.. పావు కేజీ మైదాపిండి... 150 గ్రా. మినపపిండి... ఒక కప్పు ఉల్లిపాయలు.. నాలుగు పచ్చిమిర్చి.. ఆరు కొత్తిమీర... 2 కట్టలు వంటసోడా.. చిటికెడు ఉప్పు... తగినంత నూనె.. సరిపడా
తయారీ విధానం : ఓ గిన్నెలో మినప్పిండి వేసి అందులోనే రవ్వ, మైదాపిండి, వంటసోడా వేసి నీళ్లు చేర్చి జారుగా కలిపి 3 గంటలపాటు పులియనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి.
ఓ బాణలిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని చిన్నచిన్న ఉండలుగాచేసి కాగుతున్న నూనెలో వేసి.. ఎర్రగా వేయించి తీయాలి. వీటిని ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి. అంతే మన దాయాదులైన పాకిస్థానీయులు ఇష్టంగా తినే కరాచీ పుణుకులు తయార్...!