పుదీనా ఘుమఘమలతో "బగారా మింట్ రైస్"

FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం.. ఒక కేజీ
ఉల్లిపాయలు.. 2
నూనె లేదా నెయ్యి.. 5 టీ.
అల్లం వెల్లుల్లి పేస్ట్.. 1 టీ.
పచ్చిమిరపకాయలు.. 5
కొత్తిమీర.. ఒక కట్ట
పుదీనా.. 2 కట్టలు
పెరుగు.. 1 కప్పు
బిర్యానీ ఆకులు.. 2
యాలకులు.. 2
లవంగాలు.. 2

తయారీ విధానం :
వెడల్పాటి గిన్నెలో నూనె వేడిచేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, లవంగాలు, ఏలకులు, ఉల్లిపాయ తరుగు కలిపి వేయించాలి. ఆ తరువాత పెరుగు కలిపి, రెండు లీటర్ల నీటిని పోసి... మరుగుతుండగా ముందుగా నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని అందులో పోయాలి. బియ్యం బాగా ఉడికిన తరువాత దించబోయేముందు కొత్తిమీర దానికి కలిపి దించేయాలి. అంతే బగారా మింట్ రైస్ సిద్ధం..!

వెబ్దునియా పై చదవండి