మామిడి పూరీలు

గురువారం, 8 జనవరి 2009 (18:01 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... 20 గ్రాములు
మైదాపిండి... 50 గ్రాములు
పంచదారపొడి... 2 టీస్పూన్లు
కారం... అర టీస్పూను
మామిడిపండు రసం.... ఒక కప్పు
నెయ్యి... మూడు టీస్పూన్లు
ఉప్పు... చిటికెడు
నూనె... పూరీలను వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా గోధుమపిండి, మైదాపిండి, పంచదార పొడి, కారం, ఉప్పులను ఒక పాత్రలో వేసి... మామిడి రసం, నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ పూరీల పిండిలా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉన్నట్లయితే సరిపడా నీళ్లను కూడా వాడవచ్చు.

తడిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలు వత్తుకోవాలి. నూనె వేడిచేసి అందులో వీటిని వేసి.. మామూలు పూరీల్లాగా కాకుండా మరి కాస్త ఎక్కువసేపు వేయించండి. వేడివేడిగా ఉండే ఈ పూరీలను మ్యాంగో, ఆపిల్ స్వీట్ చట్నీలతో తింటే మరింత రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి