తయారీ విధానం : మైదాపిండి జల్లించి ఉంచుకొని, ఒక పాత్రలో ఈస్ట్, పంచదార, కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచుకోవాలి. మైదాపిండిలో ఈ మిశ్రమంతో పాటుగా, పాలు, ఉప్పు, సోంపు వేసి బాగా మెత్తగా పూరీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దను 20 నిమిషాలపాటు నానబెట్టాలి.
ఇలా చేయడంవల్ల ముద్దలో కలిసిన ఈస్ట్ వల్ల పిండి బాగా ఉబ్బుతుంది. తరువాత మళ్ళీ ఈ పిండిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీల్లాగా చేయాలి. పెనం వేడి చేసి వీటిని వేసి రెండువైపులా కాల్చి నెయ్యి రాసి వేడి వేడిగా తింటే చాలా రుచిగా వుంటాయి.