సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

ఠాగూర్

సోమవారం, 23 జూన్ 2025 (23:14 IST)
తన దర్శకత్వంలో వచ్చిన "థగ్‌లైఫ్" ప్రేక్షకులకు అంచనాలను అందుకోలేకపోయిందని దర్శకుడు మణిరత్నం అన్నారు. ఈ విషయంలో ఆడియన్స్‌కు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకులు మరో క్లాసిక్‌ను ఆశించారని అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో 'థగ్‌లైఫ్' చిత్రం ఫెయిల్యూర్‌పై ఆయన స్పందించారు. 
 
"మా ఇద్దరి నుంచి మరో నాయకుడును ఆశించిన వారికి నేను చెప్పగలిగేది ఒక్కటే. మమ్మల్ని క్షమించండి. ఆ సినిమా కంటే తక్కువ దాన్ని చేయడం మా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన మాకెపుడూ లేదు. అలా ఎలా చేయాలనుకుంటాం. మేం పూర్తిగా భిన్నమైన దాన్ని ఆదించాలనుకున్నానాం. ఎక్కువ అంచనా వేయడంతో మేం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకోయాం. మేము అందించిన దానికంటే ఆడియన్స్ భిన్నంగా కోరుకున్నారని అర్థం చేసుకున్నా" అని మణిరత్నం అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు