ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

ఠాగూర్

సోమవారం, 23 జూన్ 2025 (22:28 IST)
తాను ప్రేమించి వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆ ప్రియురాలు జీర్ణించుకోలేకపోయింది. అంతే తన ప్రేమికుడుకి సమస్యలు సృష్టించాలన్న అక్కసుతో బాంబు బెదిరింపులకు దిగింది. ఇది చెన్నైలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రెనే జోషిల్డా అనే మహిళ చెన్నైలోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలు సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేస్తుంది. ఓ వ్యక్తిని ఆమె వన్‌సైడ్‌ లవ్ చేసింది. అతడినే వివాహం చేసుకోవాలని భావించింది. అయితే, ఆ వ్యక్తి మాత్రం ఇంట్లో కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. దీన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. అతడి ప్రతిష్టను దిగజార్చాలనుకుంది. 
 
ఇందుకోసం తన టెక్నాలజీ తెలివితేటలను ప్రదర్శించింది. ఈ క్రమంలో నకిలీ ఈమెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, వీపీఎస్‌ల ద్వారా గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు తదితర  12 రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బాంబు బెదిరింపు సందేశాలను పంపించింది. 
 
అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం, బీజే వైద్య కాలేజీ, రెండు పాఠశాలలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఓ పాఠశాల యాజమాన్యం ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సైబర్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకున్నారు. తన గుర్తింపు, లొకేషన్ బయటపడకుండా ఆమె తెలివిగా వ్యవహరించింది. కానీ, చిన్న తప్పిదంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు