కావలసిన పదార్థాలు : బియ్యం.. ఒక కేజీ ఉల్లిపాయలు.. 2 నూనె లేదా నెయ్యి.. 5 టీ. అల్లం వెల్లుల్లి పేస్ట్.. 1 టీ. పచ్చిమిరపకాయలు.. 5 కొత్తిమీర.. ఒక కట్ట పుదీనా.. 2 కట్టలు పెరుగు.. 1 కప్పు బిర్యానీ ఆకులు.. 2 యాలకులు.. 2 లవంగాలు.. 2
తయారీ విధానం : వెడల్పాటి గిన్నెలో నూనె వేడిచేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, లవంగాలు, ఏలకులు, ఉల్లిపాయ తరుగు కలిపి వేయించాలి. ఆ తరువాత పెరుగు కలిపి, రెండు లీటర్ల నీటిని పోసి... మరుగుతుండగా ముందుగా నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని అందులో పోయాలి. బియ్యం బాగా ఉడికిన తరువాత దించబోయేముందు కొత్తిమీర దానికి కలిపి దించేయాలి. అంతే బగారా మింట్ రైస్ సిద్ధం..!