తయారీ విధానం : బంగాళాదుంపలు, బీన్స్, క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. ఈ కూరగాయల ముక్కల్ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో దానిమ్మ గింజలు, పనీర్ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, చిక్కటి పాలు పోసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు కాప్సికమ్ను మధ్యలో గుండ్రంగా రంధ్రం చేసి అందులో కూరగాయ ముక్కల మిశ్రమాన్ని కూరాలి.
అలా మొత్తం చేసుకున్నాక వాటిని గ్రిల్లో పెట్టి మైక్రోవేవ్ ఓవెన్లో పది నిమిషాలపాటు వేయించాలి. తరువాత బయటికి తీసి క్యాప్సికమ్లను సన్నటి చాకుతో మధ్యకు కట్ చేసి పుదీనా సాస్తో కలిపి సర్వ్ చేయాలి. రుచికి రుచీ, ఆరోగ్యానికి కూడా మంచిదైన మిర్చిదమ్ అనార్ చేయటం కూడా తేలికే..!