కావలసిన పదార్థాలు : పెద్ద గోధుమ రవ్వ.. 400 గ్రా. జీలకర్ర.. ఒక టీ. నూనె.. ఒకటిన్నర టీ. ఉల్లిపాయలు.. 2 పచ్చిమిర్చి.. 4 యాలకులు.. 4 పులావు ఆకులు.. మూడు లవంగాలు.. 4 దాల్చిన చెక్క.. కాస్తంత అల్లం.. కొద్దిగా వెల్లుల్లి.. 8 రేకలు టొమోటోలు.. 2 శెనగపప్పు.. అర కప్పు పెరుగు.. అర కప్పు ఉప్పు... తగినంత పసుపు.. ఒక టీ. నిమ్మరసం.. ఒక టీ.
తయారీ విధానం : ప్రెషర్ కుక్కర్లో నూనె వేసి వేడి చేయాలి. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చితోపాటు మొత్తం మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. గోధుమ రవ్వ, శెనగపప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి.
తరువాత మంట తగ్గించి మరో మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలి. అప్పటికి రవ్వ బాగా ఉడుకుతుంది. చివరగా నిమ్మరసం చల్లి వేడివేడిగా వడ్డించాలి. పలావ్, బిర్యానీ ఏదైనా పొడిపొడిగా రావాలంటే బియ్యాన్ని బాగా కడగాలి. తరువాత నీళ్లన్నీ వంపేసి ఓ ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. ఉడికేటప్పుడు మధ్యలో కొద్దిగా నిమ్మరసం కూడా పిండితే పలావ్ పొడిపొడిగా ఉంటుంది.