కావలసిన పదార్థాలు : పచ్చిమిర్చి తరుగు... రెండు టీ. వెన్న... రెండు టీ. జీరాపొడి... ఒక టీ. ధనియాల పొడి... ఒక టీ. కొత్తిమీర... పావు కప్పు లేత మొక్కజొన్న గింజలు... ఒక కప్పు మిరియాల పొడి... అర టీ. నూనె... తగినంత ఉప్పు... సరిపడా టమోటో జ్యూస్... ఒక కప్పు
తయారీ విధానం : బాణలి వేడయ్యాక నూనె, వెన్న వేసి కాగిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఆపై ఉడికించిన లేత మొక్కజొన్న గింజలు, జీరా, ధనియాలపొడి, మిరియాల పొడి, ఉప్పు, టమాటో జ్యూస్ను కలిపి వేయించాలి. తగినంత నీటిని పోసి గ్రేవీ దగ్గరకు వచ్చేలా ఉడికించాలి. తరువాత కిందికి దించి కొత్తిమీర పైన చల్లి, అతిథులకు వడ్డించాలి. ఈ మొక్కజొన్న గింజల కర్రీని చపాతీలకు, వేడి వేడి అన్నానికి సైడ్డిష్గా వాడుకోవచ్చు.