కావలసిన పదార్థాలు : సిమ్లా మిర్చి... 150 గ్రా. నూనె.. 50 గ్రా. నీరు.. 2 కప్పులు ఉడికించిన బఠాణీలు.. 2 కప్పులు హైబ్రిడ్ టొమోటోలు.. ఒక కప్పు ఉల్లిముద్ద.. రెండు టీ. కొబ్బరిపొడి.. ఒక టీ. వెల్లుల్లి రేకలు.. 2 కొత్తిమీర ముద్ద.. ఒక టీ. కారం.. అర టీ. ధనియాలపొడి.. అర టీ. జీలకర్ర పొడి.. అర టీ. పసుపు.. పావు టీ. ఉప్పు.. తగినంత
తయారీ విధానం : కడాయిలో నూనె పోసి కాగాక వెల్లుల్లి రేకలు, ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ముక్కల్ని కలుపుతూ కొద్దిగా మగ్గనిచ్చి బఠాణీలు వేసి తిప్పాలి. తరువాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి, వేసి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 2 నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనివ్వాలి. చివరగా టొమాటో ముక్కలు వేసి కలిపి ఓ నిమిషం తరువాత కడాయి దించేస్తే.. బఠాణీ భాజి రెడీ..!! ఇది రోటీలోకి చాలా రుచిగా ఉంటుంది.