ఉగ్రవాదాన్ని ఇక సహించబోము: ఖురేషి

తమ దేశంలో ఇకపై ఉగ్రవాదాన్ని సహించేది లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి షాహ్ ముహమ్మద్ ఖురేషీ తెలిపారు.

ప్రస్తుతం తమ దేశంలో వేళ్ళూనుకునివున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించివేస్తామని, ఇకపై ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఇక చూస్తూ ఊరుకోదని, మత ఛాందసవాదుల కార్యకలాపాలలో తమ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని, ఇకపై ఇలాంటి వెసలుబాటు ఉండదని ఆయన అన్నారు.

పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పేరిట తీవ్రవాదులు ప్రజలను హతమారుస్తున్నారని, ఇలాంటివాటిని ఇకపై సహించేది లేదని ఆయన ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి