బర్త్‌డే పార్టీలో ఘాతుకం : తండ్రితో సహా ఇంట్లో ఉంటున్న వారిని కాల్చి చంపిన కుమారుడు...

వరుణ్

ఆదివారం, 7 జులై 2024 (09:13 IST)
అమెరికాలో మరోమారు కాల్పుల మోత వినిపించింది. ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఇంటి యజమాని కాగా మరో ముగ్గురు సన్నిహుతులు ఉన్నారు. పైగా, ఈ కాల్పులకు పాల్పడింది ఆ ఇంటి యజమాని కుమారుడు కావడం గమనార్హం. పైగా, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అమెరికాలోని ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. 
 
ఈ కాల్పుల ఘటనను పరిశీలిస్తే, బర్త్ డే పార్టీలో 21 యేళ్ల ఇంటి యజమాని కుమారుడు తుపాకీతో మారణహోమం సృష్టించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది గాయపడ్డారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న అమెరికా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా అప్పటికే నలుగురు చనిపోయివున్నారు. మరికొందు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పోలీసుల కన్నుగప్పి పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించి, అతడు నడుపుతున్న కారు ఓ లోయలో పడిపోయింది. ఆ తర్వాత తనను తాను తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణానికి పాల్పడింది ఇంటి యజమాని కుమారుడు కావడం గమనార్హం. తాను జరిపిన కాల్పుల్లో తండ్రితో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో పోలీసుల భయంతో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు