యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి సబ్బంది కిడ్నాప్

ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:08 IST)
అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న యెమెన్ దేశంలో ఆ దేశ పౌరులతో పాటు విదేశీ ప్రతినిధులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఓ మిషన్ కోసం ఈ సిబ్బంది సౌత్ యెమెన్ దేశంలో గత పని చేస్తున్నారు. 
 
ఈ పనిని ముగించుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని దండుగులు వీరిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని ప్రాణాలతో రక్షించేందుకు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్టు యెమెన్‌లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి రస్సెల్ గీకీ వెల్లడించారు. 
 
కాగా, యెమెన్ దేశంలో గత 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూపునకు మధ్య తీవ్ర పోరు సాగుతోంది. గత 2015లో యెమెన్ ప్రభుత్వానికి హౌతీలు కూల్చవేశారు కూడా. అప్పటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు