చైనాలో వెలుగుచూసిన కొత్త బ్యాక్టీరియా ''బ్రూసెల్లోసిస్”

శుక్రవారం, 6 నవంబరు 2020 (14:29 IST)
చైనాలోని వూహాన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ అంతం కాకముందే మరో బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని బ్రూసెల్లోసిస్ అని గుర్తించారు. గన్స్ ప్రావిన్స్ రాజధాని లాన్ ఝౌల్‌లో ఆరు వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
 
ఏడాది క్రితం చైనా పశుసంవర్థక శాఖకు సంబంధించిన బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి లీకేజ్ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు పేర్కొంది. నగరంలో మొత్తం 55,725 మందిని పరీక్షించగా వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బ్యాక్టీరియా సోకిన జంతవులలో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతందని లాన్ఝౌ హెల్త్ కమిషన్ పేర్కొంది.
 
కాగా ఈ ఏడాది సెప్టెంబరులో 3,245మంది ఈ బ్యాక్టీరియా బారిన పడ్డారు. ఈ బ్యాక్టీ రియా సోకిన వారిలో ప్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు