చైనాపై మండిపడిన నిక్కీ హేలీ.. కరోనా మృతులు అంత తక్కువా?

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (17:07 IST)
అమెరికా రాజకీయ వేత్త, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ చైనాపై మండిపడ్డారు. కరోనా కారణంగా తమ దేశంలో 3300 మంది మాత్రమే మరణించారన్న చైనా ప్రకటన వాస్తవానికి చాలా దూరంగా ఉందని నిక్కీ హేలీ అన్నారు. చైనాలో కరోనా కేసులు బయటపడిన రెండు నెలలకు అమెరికాకు పాకిన ఈ వైరస్ అక్కడ ఇప్పటికే 5800 మందిని బలితీసుకుంది. 
 
2.4 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో చైనా తమ దేశంలో మృతి వారి సంఖ్యను తక్కువ చేసి చెబుతోందన్న ఆరోపణలున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ దేశాలకు సాయం చేయాల్సింది పోయి.. తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి చైనా ప్రయత్నిస్తోందని హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నిజానికి చైనాలో 42 వేల మందికిపైగానే మరణించి ఉంటారన్న వార్తలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. యూరప్‌లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా చెప్తున్న లెక్కలు ఏమాత్రం నమ్మశక్యంగా లేవని నిక్కీ హేలీ అన్నారు. కరోనా మరణాల విషయంలో చైనా చెబుతున్న లెక్కలను నమ్మొద్దంటూ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ సూచించిన నేపథ్యంలో నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు