సముద్రంలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 53 మంది జల సమాధి అయ్యారు. ఈ దారుణం లిబియా సముద్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 55 మంది వలసదారులతో కూడిన రబ్బరు బోటు ఫిబ్రవరి 5న రాత్రి 11 గంటలకు లిబియాలోని జావియా నగరం నుంచి బైలుదేరింది. ఐతే ఆ పడవ సముద్రంలో ఆరు గంటలు ప్రయాణించిన తర్వాత సముద్రపు భారీ అలల ఉధృతికి అతలాకుతలమైంది.