కరోనా వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుంది.. అదో బయోవెపన్: చావోషావ్

గురువారం, 29 జూన్ 2023 (10:21 IST)
ప్రపంచాన్ని కుదేపేసిన కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు చావోషావ్ వెల్లడించారు. దీంతో కరోనా వైరస్ సహజంగా పుట్టినది కాదని విషయం బహిర్గతమైంది. 
 
ఓ ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాన్ని చావోషావ్ చెప్పుకొచ్చారు. షావో ఇంటర్వ్యూ వివరాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.
 
పై అధికారి ఒకరు తమకు నాలుగు రకాల కరోనా వైరస్‌లను ఇచ్చి అందులో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 
 
2019లో వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తమ సహచరులు చాలామంది కనిపించకుండా పోయారని తెలిపారు. 
 
క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో వారి ఆరోగ్యం, అక్కడి పరిశుభ్రతను పరిశీలించేందుకు వారిని పంపినట్టు తర్వాత తెలిసిందన్నారు చావోషావ్. కరోనా వైరస్‌ను షావో బయోవెపన్‌గా అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగానే దీనిని సృష్టించినట్టు ఆయన పేర్కొన్నారు.
 
నిజానికి ఆ పనికి వైద్యులు సరిపోతారని, వైరాలజిస్టులతో పనిలేదని పేర్కొన్నారు. తనకు అప్పుడే అనుమానం వచ్చిందని, వైరస్‌ను అక్కడ వ్యాప్తి చేసేందుకే వారిని పంపి ఉంటారన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు