కిమ్‌కు చైనా వైద్యం?

శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:30 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కు చైనా వైద్యం అందించనుంది. కిమ్ అనారోగ్యంపై వస్తున్న వార్తలపై ఆ దేశం ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

ఇంకోపక్క, దాయాది దేశం దక్షిణ కొరియా కూడా ఈ వార్తలను ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. అయితే, ఇప్పుడు కిమ్ ఆరోగ్యంపై అనుమానం తలెత్తేలా మరో వార్త ప్రచారం అవుతోంది.

కిమ్‌కు చికిత్స చేసేందుకు నిపుణులైన వైద్య బృందాన్ని ఉత్తరకొరియాకు చైనా పంపినట్టు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ లయన్స్ విభాగం సీనియర్ సభ్యుడి నాయకత్వంలో వైద్య బృందం చైనా నుంచి ఉత్తర కొరియా వెళ్లినట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు