ఆప్ఘన్‌లో మహిళా జడ్జీల కోసం సాగుతున్న తాలిబన్ల వేట

గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:39 IST)
గత రెండు దశాబ్దాల కాలంలో తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన, శిక్షలు విధించిన మహిళా జడ్జీల కోసం తాలిబన్ తీవ్రవాదులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇలాంటివారిలో ఇప్పటికే అనేక మంది దేశాన్ని వీడిపోయారుకూడా. మిగిలిన వారు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ దొంగచాటుగా జీవిస్తున్నారు. ఇలాంటి వారంతా రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 
 
ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది నేరగాళ్లకు విముక్తి ప్రసాదించారు. వారిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అలా విడుదలైన వారిలో దాదాపుగా అందరూ గతంలో తాలిబన్ల తరపున పనిచేసినవారే. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వీరికి శిక్ష విధించడమే మహిళా న్యాయమూర్తులు చేసిన పాపం. 
 
జైలు నుంచి విడుదలైన నేరస్థులు.. ప్రస్తుతం మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష వేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణ భయంతో దాక్కున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు