భారత్ మమ్మలను ఏం చేయలేదనీ, అలాగే, దౌత్యపరంగా ప్రపంచంలో తాము ఏకాకి కాలేదనీ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించారు. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ సర్జికల్ దాడులు జరిపిన విషయం తెల్సిందే. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ భారత్తో తాము దొడ్డిదారి సంబంధాలు కావాలనుకోవడం లేదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో తెరచాటున ఏమీ జరగడం లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాలు అటువంటి సంబంధాలను కోరుకుంటే అది జరగబోవన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ పాకిస్థాన్ను వేలెత్తి చూపుతోందని మండిపడ్డారు.
ముఖ్యంగా భారత్లో ఏ చిన్నపాటి దాడి జరిగినా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై నిందలు మోపడం రివాజుగా మారిపోయిందన్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం చర్చలు నిలిచిపోయిన మాట నిజమేనన్నారు. పాక్ సరైన దిశలోనే ముందుకు వెళ్తోందని, దౌత్యపరంగా పాక్ ఏకాకి కాలేదని స్పష్టం చేశారు. చైనాతో పాక్కు సత్సంబంధాలు పెరుగుతుండడం ఇతర దేశాలకు కంటగింపుగా మారిందని అజీజ్ అన్నారు.