యజ్ఞం సినిమాతో గోపీచంద్ అనే విలన్ ను హీరోగా మలచిన దర్శకుడు రచయిత ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి గుండెపోటుతో రాత్రి తన ఫ్లాట్ లోనే చనిపోయారు. రాజ్ తరుణ్ తో తిరగ బడరా స్వామి సినిమా తీయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో డిప్రెషన్ కు గురై కొంతకాలంగా భార్య నాగ బిందు కు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసం.