సభ్యసమాజం సిగ్గుపడేలా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మారణ హోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాక్లో మరో దారుణం చోటు చేసుకుంది. లైంగికవాంఛను తీర్చలేదని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు విచక్షనారహితంగా కాల్పులు జరిపి 150 మంది మహిళలను చంపేశారు. వారిలో మృతుల్లో అభంశుభం తెలియని చిన్నారులు, యువతులు, గర్బవతులు కూడా ఉన్నారు.
ముస్లిమేతర తెగలలో ముఖ్యంగా యాజిదీ తెగకు చెందిన వారిని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు. జీహాదీలను పెళ్లి చేసుకోవాలని, బానిసల్లా పడి ఉండాలని ఆ వర్గానికి చెందిన మహిళలపై అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. యాజిదీ తెగలో మగవారిని చంపుతూ మహిళలను బానిసలుగా చేస్తున్నారు.