అమెరికాలోని కాన్సస్ ప్రాంతంలో తెలుగు యువకులపై జరిగిన కాల్పులపై నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. వలస ప్రజలపై వ్యతిరేకతను తారాస్థాయిలో ప్రకటిస్తున్న ట్రంప్ విధానాలే అమెరకన్లలో జాత్యహంకార ధోరణులను పెంచుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అనేకమంది ఆ విమర్శలను సమర్థిస్తున్నారు. వారిలో ప్రపంచ ప్రముఖ రచయిత్ర జేకే రౌలింగ్ కూడా ఉన్నారు.
కాన్సస్ జాతివివక్ష కాల్పులపై భారతీయ రచయిత ఆనంద్ గిరిధర్దాస్ ట్విట్టర్లో మండిపడ్డారు. ట్రంప్ అవలంభిస్తున్న విద్వేషపూరిత విధానాల మూలంగానే ఈ కాల్పులు జరిగాయని ఆయన విమర్శించారు. ఘటన అనంతరం ట్రంప్ వర్గాలు.. ఈ కాల్పులకు ట్రంప్ విధానాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన ట్విట్టర్లో విమర్శించారు.