బేతంచెర్ల మండలంలోని సిమెంట్నగర్ గ్రామానికి చెందిన డిప్లొమా, ఐటీఐ చేసిన నిరుద్యోగులు ఉపాధి కోసం ఎస్ ఎస్బీ ప్రైవే ట్ కంపెనీ లిమిటెడ్ ద్వారా లిబియాలోని యూఎస్సీసీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఫిట్టర్గా, వెల్డర్స్గా, ఎలక్ట్రీషియన్లుగా ఇన్స్టు మెంటేషన్ లేబర్స్గా 2012 జూలై, ఆగస్టు నెలల్లో రెండేళ్ల కాంట్రాక్టుపై వెళ్లారు.
కాంట్రాక్టు అగ్రిమెంట్ పూర్తయ్యాక వాళ్లు తిరిగి ఇండియాకు బయలుదేరే సమయంలో లిబియా ఎయిర్పోర్టును తీవ్రవాదులు కాల్చివేశారు. దీంతో ఇండియాకు రావాల్సిన సిమెంట్నగర్ వాసులు, ఆయా కంపెనీల ప్రతినిధులు వారికి తీసిన ఫ్లయిట్ టికెట్లను రద్దు చేసి ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాక ఇండియాకు పంపుతామన్నారు.